News March 21, 2025
నారాయణపేట: భార్యను చంపిన భర్త ARREST

నారాయణపేట మండలం రెడ్యానాయక్ తండాలో <<15830699>>భార్యను హత్య<<>> చేసిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు డీఎస్పీ లింగయ్య శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భార్య శారు రాథోడ్(20) అంటే ఇష్టం లేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో భర్త వినోద్ నాయక్ ఈనెల 19న రాత్రి ముందస్తు పథకం మేరకు గొంతు నులిమి ఆమెను హత్య చేశాడని తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు.
Similar News
News March 31, 2025
పెరిగిన బంగారం ధరలు

రెండ్రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.91,190గా ఉంది. అటు 22 క్యారెట్ల పసిడి రూ.650 ఎగిసి రూ.84,250గా విక్రయిస్తున్నారు. గత పది రోజుల్లో బంగారంపై ఇది రెండో అత్యధిక పెరుగుదల. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ ధర రూ.1,13,000గా విక్రయాలు జరుగుతున్నాయి.
News March 31, 2025
మొక్కజొన్న కంకి తిని వ్యక్తి మృతి

మొక్కజొన్న కంకులు తిని ఓ వ్యక్తి అస్వస్థతకు గురై చనిపోయిన ఘటన కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వినోభానగర్కి చెందిన జర్పల కృష్ణ మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. తోటకు కాపలాగా వెళ్లి కంకులు కాల్చుకొని తిన్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఒళ్లునొప్పులతో అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు.
News March 31, 2025
కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి ఫైర్

తెలంగాణలో హరిత విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, BRS ఒక్కటేనని దుయ్యబట్టారు. గతంలో BRS హయాంలో కాళేశ్వరం నిర్మాణానికి 25 లక్షల చెట్లను తొలగించారన్నారు. ఇప్పుడు గచ్చిబౌలిలోని HCUలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తోందని ఫైరయ్యారు. అటవీ మాఫియాలో తెలంగాణ బందీ అయిందన్నారు. గొడ్డలి మారలేదని, పట్టిన చేతులు మారాయని విమర్శించారు.