News March 21, 2025

నంద్యాల: ఫరూక్ సతీమణి చివరి కోరిక.. HYDలోనే అంత్యక్రియలు

image

మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్(69) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె తన అంత్యక్రియలను ఎక్కడ నిర్వహించాలో ముందుగానే నిర్ణయించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లోని ఆగాపుర, పాన్‌మండి ఖబరస్తాన్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మంత్రి ఫరూక్ సతీమణి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Similar News

News March 22, 2025

మచిలీపట్నం విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

image

మచిలీపట్నంలోని జడ్పీ స్కూల్ విద్యార్థులు టూర్‌‌కి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని వీరి బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News March 22, 2025

భువనగిరి జిల్లాలో వర్షపాత వివరాలు

image

భువనగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా భువనగిరి మండలంలో 29మిమీ వర్షం కురవగా, అత్యల్పంగ మోత్కూర్ మండలంలోని దతప్పగూడెంలో 0.8మిమీ వాన పడింది. యాదగిరిగుట్టలో 23.8మిమీ, బొమ్మలరామారం 23.3మిమీ, మూటకొండూర్ 20 మిమీ, రాజాపేట 17.3మిమీ, తుర్కపల్లి 16.3మిమీ, ఆత్మకూర్ 7.8మిమీగా నమోదైంది.

News March 22, 2025

IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

image

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నారు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.

error: Content is protected !!