News March 21, 2025
విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు: మంత్రి

విశాఖ ప్రజాప్రతినిధులతో పట్టణాభివృద్ధిశాఖా మంత్రి నారాయణ శుక్రవారం సమావేశమయ్యారు. వీఎంఆర్డీఏ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
Similar News
News January 10, 2026
ఖమేనీ ఫొటోలు కాల్చి.. సిగరెట్లు తాగుతున్న ఇరాన్ యువతులు

ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో యువతులు, మహిళలు ఖమేనీ ఫొటోలకు నిప్పంటించి సిగరెట్లు వెలిగించుకుంటున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్గా మారింది. సుప్రీంలీడర్ ఫొటో అంటించడం, మహిళలు సిగరెట్ తాగడం రెండూ నేరమే. మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా, స్వేచ్ఛను కోరుకుంటూ వాళ్లు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో యువతి లాకప్ డెత్ సమయంలోనూ ఇలాంటి నిరసనలే మహిళలు చేపట్టారు.
News January 10, 2026
అనంతపురం: గుండెపోటుతో SI మృతి

అనంతపురం జిల్లా పోలీస్ కంట్రోల్ రూం SI మోహన్ ప్రసాద్ విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఎస్సై మృతి పట్ల జిల్లా ఎస్పీ జగదీశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. జేఎన్టీయూ రోడ్డులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, సహచర సిబ్బంది నివాళులర్పించారు.
News January 10, 2026
సంగారెడ్డి: సెలవులో తరగతులు నిర్వహించవద్దు: డీఈవో

సంక్రాంతి సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


