News March 21, 2025

శాంతిభద్రతలపై హోం మంత్రి సమీక్ష

image

విజయవాడ డీజీపీ కార్యాలయంలో శుక్రవారం హోం మంత్రి వంగలపూడి అనిత శాంతి భద్రతలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ హరీష్ గుప్తాతో కలిసి జిల్లాల ఎస్పీలతో వివిధ అంశాలపై సమీక్షించానన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటులో పురోగతిని జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలపై నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News January 18, 2026

ఇవాళ ఈ తప్పులు అస్సలు చేయకండి!

image

నేడు మౌని అమావాస్య కావడంతో సముద్ర/గంగానది స్నానం, ఉపవాసం, మౌనవ్రతం, పూర్వీకులకు తర్పణం, దానాలు చేయడం మంచిది. వ్రత ఫలితం దక్కాలంటే ఈ తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘కోపం తెచ్చుకోవడం, ఆర్గ్యుమెంట్స్, అనవసర సంభాషణలు, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, నెగటివ్ థింకింగ్ మానుకోవాలి. సోమరితనాన్ని వదిలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అని సూచిస్తున్నారు.

News January 18, 2026

నేడు ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం

image

డబ్బు చేతిలో నిలవక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. కుంకుమపువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణావర్త శంఖంలో పోసి పూజగదిలో ఉంచాలి. అనంతరం ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ‘ఓం శ్రీ మహాలక్ష్మిదేవ్యై నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు భక్తితో జపించాలి. చొల్లంగి సంగమ స్నానం తర్వాత చేసే ఈ చిన్న పరిహారం లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.

News January 18, 2026

WC మ్యాచెస్‌పై ICCకి బంగ్లా మరో రిక్వెస్ట్

image

T20WC మ్యాచెస్ కోసం భారత్ వెళ్లేదిలేదని బంగ్లాదేశ్ ICCకి తేల్చి చెప్పింది. పలు చర్చల తర్వాత కూడా తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాల్సిందే అంటోంది. దీనిపై వచ్చే వారం ICC తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ICCకి BCB కొత్త రిక్వెస్ట్ పెట్టింది. ఐర్లాండ్‌తో గ్రూపులు స్వాప్ చేసుకుంటామని చెప్పింది. ఐర్లాండ్ గ్రూప్ Bకి వస్తే, BAN గ్రూప్ Cకి వెళ్తుంది. అప్పుడు గ్రూప్ మ్యాచులు కొలంబో, పల్లెకెలెలో ఆడే వీలుంటుంది.