News March 21, 2025
కన్నెపల్లి: మామ, బావమరిది కలిసి చంపేశారు

కన్నెపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చదువుల లక్ష్మణ్ను అతడి మామ పార్వతి రాజేశం, బావమరిది అనిల్ తీవ్రంగా కొట్టి చంపేశారు. ఎస్ఐ గంగారాం వివరాల ప్రకారం.. లక్ష్మణ్ తన భార్య రోజాతో రోజు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తన కూతురితో ఎందుకు గొడవ పడుతున్నావని శుక్రవారం రాజేశం, అనిల్ కలిసి లక్ష్మణ్ పై దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News July 7, 2025
నేను పాక్ ట్రస్టెడ్ ఏజెంట్ను: రాణా

ఢిల్లీలో NIA కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల ఘటన సూత్రధారి తహవూర్ <<16245394>>రాణా <<>>సంచలన విషయాలు వెల్లడించాడు. తాను పాక్ ట్రస్టెడ్ ఏజెంట్నని, లష్కరే తోయిబా సంస్థలో శిక్షణ పొందినట్లు చెప్పాడు. ముంబైలోని పలు ప్రముఖ ప్రాంతాలను పరిశీలించి పాక్ ISIతో కలిసి పేలుళ్లకు ప్లాన్ చేశానన్నాడు. అంతకుముందు గల్ఫ్ వార్ సమయంలో పాక్ ఆర్మీ తనను సౌదీకి పంపిందన్నాడు. కాగా రాణాను US నుంచి తీసుకొచ్చి విచారిస్తున్న విషయం తెలిసిందే.
News July 7, 2025
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

గుంటూరు మిరప మార్కెట్లో సోమవారం 20 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఏ/సీ సరుకు సంఖ్య 60 వేలుగా నమోదైంది. తాజా ధరల ప్రకారం తేజా ఏ/సి రూ.120-132, 355 ఏ/సి రూ.100-125, 2043 ఏ/సి రూ.120-130, 341 ఏ/సి రూ.120-135, నంబర్ 5 ఏ/సి రూ.125-135 ఉండగా, సీజెంటా, డీడీ, రోమి-26, బంగారం రకాల ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. నాటు 334, సూపర్ టెన్ రకాలు రూ.80-130 వరకు ఉన్నాయి. తాలుకూ ధరలు రూ.35-70 మధ్య ఉన్నాయి.
News July 7, 2025
జిల్లాలో ఎరువులు కొరత లేదు: జిల్లా వ్యవసాయ అధికారి

తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవ రావు సోమవారం తెలిపారు. జిల్లాలో గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు 35,869 టన్నుల వేర్వేరు రకాల ఎరువులను ప్రైవేటు డీలర్లు, మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఇందులో యూరియా 15,294 టన్నులు, డీఏపీ 2,615 టన్నులు, పొటాష్ 2,918 టన్నులు, సూపర్ 6,324 టన్నులు ఉన్నాయన్నారు.