News March 21, 2025

విజయవాడలో 100 బృందాలతో తనిఖీలు 

image

డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నిర్ధేశాను సారం ఈగల్ టీమ్ ఐజీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, స్థానిక పోలీసులు, డ్రగ్స్ డిపార్ట్ మెంట్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం టీమ్‌గా ఏర్పడి మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించారు. ఈగల్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడను నిర్వహించినట్లు తెలిపారు. 

Similar News

News November 9, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్లు బాగుపడేదెన్నడో..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్లు గుంతలమయంగా మారి, ప్రయాణం నరకంగా మారింది. గతంలో కొందరు నేతలు రోడ్లపైకి వచ్చి గళమెత్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడం మినహా క్షేత్రస్థాయిలో రోడ్ల సమస్యకు పరిష్కారం లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతలు పట్టించుకొని రోడ్లను బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

News November 9, 2025

మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

image

జనాబ్‌ మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.

News November 9, 2025

ములుగు: Way2Newsలో వరుస కథనాలు.. స్పందించిన సీతక్క

image

ములుగు(D) కన్నాయిగూడెంలో <<18239952>>పాముకాటుతో బాలుడు<<>> హరినాద్ స్వామి(7) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై Way2News ప్రచురించిన వరుస కథనాలకు మంత్రి సీతక్క స్పందించారు. వైద్యం అందక బాలుడు మృతి చెందినట్లు బంధువుల ఆరోపణతో వైద్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మృతికి కారణమైన వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యులతో పాటు, అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.