News March 21, 2025
MNCL: ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యం: సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం రోడ్డు సేఫ్టీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో పోలీస్, ట్రాఫిక్, ఇతర అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్స్ సందర్శించాలని, ప్రమాదాలకు సంబందించిన కారణాలు గుర్తించి వాటి నివారణకు కృషి చేయాలని సూచించారు. రోడ్లపై రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News March 23, 2025
పాపం భువీ.. SRH ఫ్యాన్స్ ఆందోళన

KKRతో మ్యాచులో పేసర్ భువనేశ్వర్ కుమార్ను RCB బెంచ్కే పరిమితం చేసింది. తుది జట్టులో ఆయనకు చోటు కల్పించలేదు. దీంతో SRH ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే SRHలో ఉండుంటే డగౌట్లో కూర్చునే పరిస్థితి రాదని కామెంట్లు పెడుతున్నారు. తర్వాతి మ్యాచుకైనా భువీని జట్టులోకి తీసుకోవాలని RCB యాజమాన్యాన్ని కోరుతున్నారు. కాగా భువీ దశాబ్దానికిపైగా SRHకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
News March 23, 2025
TODAY HEADLINES

* డీలిమిటేషన్పై HYDలో బహిరంగ సభ: రేవంత్
* కేంద్ర నిధులు రాబట్టండి.. అధికారులతో సీఎం చంద్రబాబు
* ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’: లోకేశ్
* రూ.2 లక్షలపైన ఉన్నవారికి రుణమాఫీ చేయం: తుమ్మల
* నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్
* డీలిమిటేషన్పై ప్రధాని మోదీకి జగన్ లేఖ
* జైలు నుంచి పోసాని విడుదల
* టాలీవుడ్ దేశంలోనే బెస్ట్: మోహన్లాల్
* కేకేఆర్పై ఆర్సీబీ ఘన విజయం
News March 23, 2025
₹లక్ష దాటిన వెండి ఇన్వెస్టర్లకు సూపర్ ఛాన్స్: జిమీత్

జీవితకాల గరిష్ఠానికి చేరిన వెండి ఇన్వెస్టర్లకు సదవకాశం కల్పిస్తోందని శామ్కో వెంచర్స్ CEO జిమీత్ మోదీ అన్నారు. గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన ప్రతిసారీ మంచి రాబడిని అందించిందని వివరించారు. 3, 6, 12 నెలల వ్యవధిలో 61, 62, 83% స్ట్రైక్ రేటుతో వరుసగా సగటున 21, 31, 28% రాబడి ఇచ్చిందన్నారు. కొవిడ్ టైమ్ మినహాయిస్తే Silver to Gold రేషియో 30 ఏళ్ల కనిష్ఠమైన 1.09% వద్ద ఉండటం బుల్లిష్నెస్ను సూచిస్తోందన్నారు.