News March 21, 2025

భాగస్వామికి దూరంగా ఉంటున్నారా?

image

ఒత్తిళ్లో, ఆర్థిక ఒడిదుడుకులో, అనారోగ్యాలో.. కారణాలేవైనా ఎన్నో జంటలు తమ రోజువారీ జీవితంలో దాంపత్య సుఖానికి దూరంగా ఉంటుంటాయి. అది ఏమాత్రం మంచిది కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల ఉపయోగం లేకపోగా వారి మధ్య దూరం పెరిగి చికాకులు తోడవుతాయని వివరిస్తున్నారు. ఎన్ని బాధలు ఉన్నా పడకపై భాగస్వామి చెంతచేరి సేదతీరాలని, మరుసటిరోజుకు ఇది కొత్త ఉత్సాహాన్నిస్తుందని సూచిస్తున్నారు.

Similar News

News March 22, 2025

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ

image

AP: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ను పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని కలెక్టర్‌కు సంస్థ ప్రతినిధులు అందించారు. బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయంటూ పర్యాటకులు ఫిర్యాదులు చేయడంతో ఇటీవల ఆ హోదాను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీచ్‌లో సౌకర్యాలను కల్పించింది.

News March 22, 2025

తొలి సినిమాకే ప్రెసిడెంట్ అవార్డు.. ప్రముఖ నటుడి మృతి

image

వెటరన్ యాక్టర్ రాకేశ్ పాండే (77) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో జుహూలోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. థియేటర్ ఆర్టిస్టుగా విశేష అనుభవం గల ఆయన 1969లో బసు ఛటర్జీ తీసిన క్లాసిక్ ‘సారా ఆకాశ్’తో తెరంగేట్రం చేశారు. తన నటనతో మెప్పించి ప్రెసిడెంట్ అవార్డునూ పొందారు. సినిమాలే కాకుండా ఆయన ఛోటీ బాహు, దెహ్లీజ్, భారత్ ఏక్ ఖోజ్ వంటి TV షోల్లోనూ నటించారు. రియాల్టీకి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకోవడంలో ఆయన దిట్ట.

News March 22, 2025

రుణమాఫీ విషయమై బీఆర్ఎస్ వాకౌట్

image

TG: రుణమాఫీ విషయంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం ఆ పార్టీ నేత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘అందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ అని సీఎం రేవంత్ ప్రకటించారు. రూ.2 లక్షలపైన ఉన్నవారు మిగతావి కడితే సరిపోతుందన్నారు. కానీ ఇప్పుడు రూ.2 లక్షలలోపు వారికే రుణమాఫీ అని బుకాయిస్తున్నారు. ఇందుకు నిరసనగానే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని హరీశ్ పేర్కొన్నారు.

error: Content is protected !!