News March 21, 2025
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్

క్రైమ్ థ్రిల్లర్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా జీత్, ప్రోసెన్జీత్ ఛటర్జీ, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగద కీలక పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్టవడంతో నెట్ఫ్లిక్స్ పార్ట్-2 తెరకెక్కించింది.
Similar News
News March 22, 2025
కూల్డ్రింక్స్ తాగుతున్నారా?

శీతల పానీయాల్లో మైక్రోప్టాస్టిక్లు ఉన్నట్లు థాయిలాండ్లో నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్యాకేజీతో సంబంధం లేకుండా మొత్తం 9 బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్ గుర్తించారు. ఏడాదికి ఓ వ్యక్తి సగటున 41.13 లీటర్ల కూల్డ్రింక్స్ తాగుతున్నట్లు గుర్తించారు. కూల్డ్రింక్స్ జీవక్రియ, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. మైక్రోప్లాస్టిక్ శరీరంపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి మరింత పరిశోధనలు చేయనున్నారు.
News March 22, 2025
ట్విటర్ ‘పిట్ట’కు భలే ధర

ట్విటర్ పేరు వినగానే ‘పిట్ట’ లోగోనే గుర్తుకొస్తుంది. ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత దాని పేరు, లోగోను Xగా మార్చారు. తర్వాత శాన్ఫ్రాన్సిస్కోలోని హెడ్ క్వార్టర్ బిల్డింగ్కు 12F పొడవు, 9F వెడల్పు, 254KGల బరువుతో ఉన్న పిట్ట లోగోను తొలగించారు. తాజాగా దాన్ని వేలం వేయగా 34,375 డాలర్లు(రూ.30 లక్షలు) పలికింది. 2006లో దీన్ని 15 డాలర్లతో తయారుచేయించినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.
News March 22, 2025
దిశా సాలియాన్ డెత్ కేసు: APRIL 2న విచారణ

నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ EX మేనేజర్ దిశా సాలియాన్ డెత్ కేసులో ఆమె తండ్రి వేసిన రిట్ పిటిషన్ను APRIL 2న విచారిస్తామని బాంబే హైకోర్టు తెలిపింది. 2020, జూన్ 8న తన కుమార్తె మరణించిన తీరుపై మళ్లీ దర్యాప్తునకు ఆదేశించాలని సతీశ్ సాలియాన్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. SSR మృతికీ దీనికీ సంబంధం ఉందని, అప్పటి CM ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే సాక్ష్యాలను తారుమారు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.