News March 21, 2025
అన్ని వసతి గృహాల్లో మౌళిక సదుపాయాలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులు చదువుకొనే అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి అన్ని వసతి గృహాల వార్డెన్లతో జూమ్ సమావేశం నిర్వహించారు. అన్ని వసతి గృహాలకు ఇప్పటికే మంజూరు చేసిన నిధులతో రిపేర్ పనులు పూర్తి చేశామన్నారు.
Similar News
News March 2, 2026
వరంగల్: తండ్రి ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య

తండ్రి ఫోన్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ CI రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కలహంది మండలానికి చెందిన భారత్ ఉరుసు శివారు అమ్మవారిపేట ఇటుక బట్టీలలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. తండ్రిని మూడో కుమార్తె(15) ఫోన్ అడగ్గా తర్వాత కొనిస్తానని చెప్పాడు. మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కేసు నమోదైంది.
News March 2, 2026
ADB: ఆ ఊర్లో కట్నం తీసుకోరు.. మద్యం తాగొద్దు..!

ఆదిలాబాద్(D) ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ పటేల్ మేస్రం వేంకట్ అధ్యక్షతన గ్రామస్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో సంచలన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పూర్తిగా వరకట్నాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఊర్లో జరిగే వివాహానికి ప్రతి ఇంటి నుంచి రూ.200 ఇవ్వాలన్నారు. అలాగే పెళ్లికి వచ్చేటప్పుడు మద్యం తాగవద్దని, ఇతర గ్రామాలకు వెళ్లేటప్పుడు చెప్పులు వేసుకోవద్దన్నారు. కట్నంగా బైకులనూ నిషేధించారు.
News March 2, 2026
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తుల క్యూ ఉంది. నిన్న 83,112 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా 30,054 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. రేపు చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేయనున్నారు.


