News March 22, 2025
పెద్దపల్లి: రేపట్నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రత్యేక డ్రైవ్

మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్ డి.వేణు, ఆర్డీవోలు, సంబంధిత తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూముల సంరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
Similar News
News February 25, 2026
విజయనగరం RDO, బొబ్బిలి DSP బదిలీ

2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఆర్డీవోలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. వారిని అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇవాళ కోర్టుకు కూడా హాజరుకావాల్సి వచ్చింది. వారిలో విజయనగరం RDO దాట్ల కీర్తి కూడా ఉన్నారు. అదే విధంగా బొబ్బిలి DSP భవ్య రెడ్డిని కూడా బదిలీ చేశారు.
News February 25, 2026
NRPT: వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్షించిన కలెక్టర్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై నారాయణపేట కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్, 27 సబ్ సెంటర్లు,59 పల్లె దవాఖానాల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా చికిత్సలు అందించాలని అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు.
News February 25, 2026
కృష్ణా: పునర్వికకు రూ.6కోట్లు సాయం ప్రకటించిన మంత్రి లోకేశ్

కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక అరుదైన వ్యాధితో పోరాడుతోంది. పాప ప్రాణాలు నిలపాల్సిన ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు కాగా, దాతల సాయంతో ఇప్పటికే రూ.10 కోట్లు సమకూరాయి. మిగిలిన రూ.6 కోట్లను తాను ఏర్పాటు చేస్తానని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. చిన్నారి ప్రాణాలు నిలబెట్టేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.


