News March 22, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు ఖమ్మం బిడ్డ సిరి

image

వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2025 రాష్ట్రస్థాయి పోటీలకు జేవియర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దాసరి సిరి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డా.ఎన్.గోపి తెలిపారు. కళాశాలతో పాటు మండల, జిల్లా స్థాయుల్లో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైందన్నారు. ప్రిన్సిపల్‌తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థులు దాసరి సిరికి అభినందనలు తెలిపారు.

Similar News

News March 22, 2025

జూలూరుపాడు: ‘ఉపాధి కూలీలకు రూ.600 ఇవ్వాలి’

image

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం కింద రూ.600 ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు బానోతు ధర్మ డిమాండ్ చేశారు. జూలూరుపాడులో ఉపాధి పని ప్రదేశాలను సంఘం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు మజ్జిగ, మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

News March 22, 2025

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఇలా..

image

ఖమ్మం జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొణిజర్ల(M) పెద్దగోపతి, ఖమ్మం ఖానాపురంలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. అటు సత్తుపల్లిలో 38.7, కల్లూరులో 38.6, వైరాలో 38.5, ముదిగొండలో 38.5, పెనుబల్లి 38.4, కారేపల్లిలో 37.9, ఏన్కూరులో 37.3, రఘునాథపాలెంలో 37.2, బోనకల్‌లో 36.7, కుసుమంచిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు.

News March 22, 2025

ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

image

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.

error: Content is protected !!