News March 22, 2025
పూడూరు: వారికి గుడ్ న్యూస్ చెప్పిన కలెక్టర్

పూడూరు మండల జాతీయ రహదారి పక్కన హైవేపై 20 ఎకరాల స్థలాన్ని చిరు వ్యాపారులకు అందించాలని వికారాబాద్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు 20 ఎకరాల స్థలం కోసం కసరత్తులు ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు నగరాలకు వెళ్లి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రైతులకు స్థలం కేటాయిస్తే వారి వ్యాపారం వారే చేసుకోవచ్చు.
Similar News
News July 5, 2025
నిబంధనలను పాటించకుంటే చర్యలు: గీతాబాయి

చట్టపరిధిలో నియమ నిబంధనలను పాటించని స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. గీతాబాయి హెచ్చరించారు. శుక్రవారం భీమవరంలో మెడ్ క్వెస్ట్ స్కానింగ్ సెంటర్ను గీతాబాయి తనిఖీ చేశారు. స్కాన్ సెంటర్లో పీసీ పీఎన్ డీటీ చట్టం పరిధిలో నిర్వహించాల్సిన నియమ నిబంధనలను పరిశీలించారు.
News July 5, 2025
హాయక చర్యలకు సన్నద్ధం కావాలి: కలెక్టర్

కోనసీమ జిల్లాలో రుతుపవనాలతో సంభవించే తుఫాన్లు, గోదావరి వరదలలో ప్రజలకు సమర్థవంతంగా సహాయక చర్యలను అందించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రెవెన్యూ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సంబంధించిన సహాయక చర్యలపై ఆయన దిశా నిర్దేశం చేశారు.
News July 5, 2025
మోదుగుల గూడెంలో వర్షానికి కూలిన ఇల్లు

కురవి మండల పరిధి మోదుగుల గూడెంలో వర్షాల వల్ల రాసమల్ల యాదగిరి, సాలమ్మ దంపతుల ఇంటి పైకప్పు కూలింది. దీంతో దంపతులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంటి పెంకులు సాలమ్మ మీద పడటంతో వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.