News March 22, 2025
శ్రీకాళహస్తి తిరుచ్చిపై జ్ఞాన ప్రసూనాంబ దర్శనం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తికి అలంకారాలు చేశారు. తర్వాత తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
Similar News
News September 15, 2025
MHBD: ఘోరం.. యూరియా కోసం వెళ్లి మృత్యుఒడికి

యూరియా కోసం వెళ్లిన ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బొద్దుగొండకు యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా గూడూరు మండలంలో జగన్ నాయకులగూడెం వద్ద వేగంగా వచ్చిన బోలెరో వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దారావత్ వీరన్న, బానోత్ లాల్య అనే ఇద్దరు రైతులు మృతి చెందారు. ఇంటికి యూరియా బస్తా తెస్తారని ఎదురుచూస్తున్న వారి కుటుంబాలకు ఇది తీరని విషాదాన్ని మిగిల్చింది.
News September 15, 2025
మరో ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హతం

ఝార్ఖండ్లోని హజారీబాగ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. మిగతా ఇద్దరు చంచల్, జహల్పై తలో రూ.50 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,060కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,42,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.