News March 22, 2025
శ్రీకాళహస్తి తిరుచ్చిపై జ్ఞాన ప్రసూనాంబ దర్శనం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తికి అలంకారాలు చేశారు. తర్వాత తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
Similar News
News January 11, 2026
జనగామ: అధికారుల తప్పిదం.. అర్హులకు అన్యాయం!

ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో అధికారుల నిర్వాకం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఇటీవల రేషన్ కార్డులు పొందిన వారు గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకునే క్రమంలో రేషన్ కార్డుతో వేరొకరు లబ్ధిపొందుతున్నట్లు ఆన్లైన్లో చూపిస్తుండడంతో, అసలైన అర్హులు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రఘునాథపల్లి పరిధిలో ఓ మహిళ గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో అసలు విషయం తెలిసింది.
News January 11, 2026
మేడారం: టూర్లతో పనులకు బ్రేకులు!

అసలే మేడారం జాతరకు టైమ్ లేదు. మరోపక్క ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికే 7 సార్లు వచ్చిన మంత్రి పొంగులేటి, ఆదివారం మరోసారి వస్తున్నారు. ఆయనతో పాటుగా నలుగురు మంత్రులు వస్తుండటంతో జాతర పనులకు ఆటంకం ఏర్పడుతుందని కార్మికులు వాపోతున్నారు. అసలే సమయం లేకపోగా, మంత్రుల వరుస పర్యటనతో 3 నుంచి 4 గంటల పాటు పనులు నిలిచిపోతున్నాయి. మరోపక్క భక్తులు సైతం పోటెత్తుండటంతో ఈ పనులు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
News January 11, 2026
కమనీయం.. కొత్తకొండ వీరభద్రుడి కల్యాణం

కొత్తకొండ వీరభద్ర స్వామి కల్యాణం శనివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ కల్యాణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం అనంతరం భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకువచ్చి వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


