News March 25, 2024
TODAY HEADLINES:

* 111 మందితో బీజేపీ ఐదో జాబితా విడుదల
* TG: దేశంలో 370 సీట్లు.. ప్రతి బూత్లో 370 ఓట్లు: కిషన్ రెడ్డి
* రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: హరీశ్
* AP: 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన
* ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం: పవన్ కళ్యాణ్
* 27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం
* IPL: లక్నోపై RR విజయం..
Similar News
News March 25, 2026
పెట్రోల్ ధరలు పెరగవు: కేంద్రం

దేశంలో తగినంత మేర ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టంచేశారు. రూమర్లను నమ్మి ప్రజలు పానిక్ బయింగ్ చేయొద్దని కోరారు. మరోవైపు పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG) కనెక్షన్లకు అవకాశం ఉన్నా వినియోగించుకోని వారికి LPG కనెక్షన్లను కట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. 3 నెలల్లోగా PNGకి మారకపోతే LPG సరఫరా ఆపేస్తామని చెప్పింది.
News March 25, 2026
ఇరాన్కు చేరిన ట్రంప్ ప్రపోజల్.. వయా పాకిస్థాన్!

ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల సీజ్ఫైర్ ప్రపోజల్ను ఇరాన్కు పాకిస్థాన్ అప్పగించినట్లు Reuters తెలిపింది. తమ మధ్యవర్తుల ద్వారా ప్రపోజల్ను ఇరాన్ యంత్రాంగానికి అందజేశామని పాక్ అధికారులు చెప్పారని పేర్కొంది. ఇస్లామాబాద్లో US, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయని, US ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా పాల్గొంటారని <<19468358>>వార్తలు రావడం<<>> తెలిసిందే.
News March 25, 2026
అన్ని కాలేజీల్లో ఇక ఫేషియల్ రికగ్నిషన్ హాజరు

AP: కాలేజీకి రాకుండానే హాజరును మేనేజ్ చేద్దామనుకుంటే ఇక కుదరదు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు, లెక్చరర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేయాలని GOVT నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్తో పాటు ప్రైవేటు కాలేజీలకూ వచ్చే ఏడాది నుంచి ఇది వర్తించనుంది. రియల్ టైమ్ పర్యవేక్షణతో హాజరు శాతాన్ని పెంచడం ద్వారా ప్రమాణాలు మెరుగుపర్చనుంది. 75% హాజరుంటేనే విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది.


