News March 22, 2025

NRPT: భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి: కలెక్టర్

image

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మరింత వేగం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉట్కూర్ మండలంలోని దంతన్‌పల్లి గ్రామంలో భూసేకరణను నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పాల్గొన్నారు.

Similar News

News February 24, 2026

HYD: గాంధీ విగ్రహం వద్దని గాంధీ మునిమనవడి ట్వీట్

image

మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహం కోసం ప్రజలను తరలించడం అత్యంత అగాంధేయ చర్య అని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అన్నారు. ఇళ్లను కూల్చి స్థలం కల్పించడం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బాపు ఉండి ఉంటే ‘నా పేరుతో ఇలాంటి పనులు చేయొద్దు’ అని చెప్పేవారని తుషార్ గాంధీ Xలో ట్వీట్ చేశారు.

News February 24, 2026

NZB: ఈనెల 25న జాబ్ మేళా

image

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బి.ఫార్మా, డి.ఫార్మా, ఎం.ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. వయస్సు 18 నుంచి 35 లోపు అర్హులని వెల్లడించారు.

News February 24, 2026

నేనూ కుల వివక్షను ఎదుర్కొన్నా: భట్టి

image

TG: రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చినప్పటికీ అంటరానితనం తగ్గలేదని Dy.CM భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. INC శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ తాను కూడా జీవితంలో కుల వివక్షను ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. ‘కులం అనేది సామాజిక వాస్తవం. దీన్ని అంగీకరించి మార్పు దిశగా అడుగులు వేయాలి. ఉన్నత విద్యావంతులూ కుల అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ సామాజిక సమానత్వం కోసం ప్రయత్నిస్తోంది’ అని చెప్పారు.