News March 25, 2024

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌‌వి అబద్ధపు ప్రచారాలు

image

నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. నల్గొండలో శనివారం ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ 6 పథకాలు అమలు చేయలేదు. వంద రోజుల్లో వంద రూపాయల పని కూడా జరగలేదు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన రోజునే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.

Similar News

News January 2, 2026

ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: నల్గొండ కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ముఖ్యమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని సూచించారు.

News January 2, 2026

జిల్లా కలెక్టర్‌ను కలిసిన నల్గొండ ఎస్పీ

image

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో ఎస్పీ మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని పలు అంశాలపై వారు క్లుప్తంగా చర్చించుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొని కలెక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.

News January 2, 2026

పొగమంచుతో ప్రయాణం.. తస్మాత్ జాగ్రత్త: నల్గొండ ఎస్పీ

image

చలికాలంలో పొగమంచు కారణంగా రహదారి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. దృశ్యమానత తక్కువగా ఉన్నప్పుడు అతివేగం, ఓవర్‌టేకింగ్‌లకు దూరంగా ఉండాలని కోరారు. వాహనాలకు తప్పనిసరిగా ఫాగ్ లైట్లు వాడాలని, ముందు వాహనానికి సురక్షిత దూరం పాటించాలని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.