News March 22, 2025
వరంగల్ రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన రైల్వే జనరల్ మేనేజర్

వరంగల్ రైల్వే స్టేషన్ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని సమీక్షించారు. ఏబీఎస్ఎస్లో భాగంగా రూ.25.89 కోట్ల వ్యయంతో స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు అనుసరిస్తున్న భద్రత విధానాలను మార్గదర్శకాలను పరిశీలించారు.
Similar News
News November 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 9, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్పీఎస్ అభ్యర్థులు: నాగరాజు

రాష్ట్రంలో జరిగే ప్రతి ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అభ్యర్థులు పోటీ చేస్తారని ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు తెలిపారు. శనివారం ఆయన అనంతపురంలోని ప్రెస్క్లబ్లో మాట్లాడారు. ఎమ్మెల్సీలను నమ్మి ఓటు వేసిన గ్రాడ్యుయేట్, ఉద్యోగ, ఉపాధ్యాయ ఓటర్లను మోసం చేస్తున్నందునే వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆర్పీఎస్ పోటీ చేస్తుందన్నారు.
News November 9, 2025
సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి సర్క్యులర్ జారీ

సింగరేణి సంస్థలో అంతర్గత అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసింది. ఈ 2 గ్రేడ్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ&ఎం) పోస్టులు 23, సివిల్లో 4, ఈ 1 గ్రేడ్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ&ఏం) పోస్టులు 33, సివిల్లో 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 10 నుంచి 24లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు


