News March 22, 2025

భద్రాచలం పంచాయతీ ఆదాయం రూ.1.25 కోట్లు

image

భద్రాచలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం వేలం పాట నిర్వహించగా ఆశీలు రూ.1.25కోట్లకు రంగా అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. గోదావరి నదిలో బోట్లకి రూ.27.25 లక్షలు, చర్ల రోడ్డులో వారసంతకు రూ.3.80లక్షలు, మరో మూడు దుకాణాలకు 3.67లక్షలు పలికాయి. కాగా మరోసారి ఆశీలు టెండర్ దక్కించుకునేందుకు పాత గుత్తేదారు రూ.1.23 కోట్ల వరకు పాట పాడారు. వీటి ద్వారా ఏడాది జీపీకి అదనపు ఆదాయం రానుంది.

Similar News

News July 6, 2025

ADB: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు

image

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన అభ్యర్థులకు HYDలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కొరకు
https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని ADB బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు.

News July 6, 2025

సిగాచీ పరిశ్రమలో కొనసాగుతున్న సహాయక చర్యలు: కలెక్టర్

image

సిగాచీ పరిశ్రమలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొమ్మిది మంది ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పారు. 34 మంది కార్మికుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. 9 మంది కార్మికుల కుటుంబాలకు రూ.10వేల చొప్పున అందించినట్లు వివరించారు.

News July 6, 2025

ఖమ్మం డీసీసీబీ బంగారు తాకట్టు రుణాలాలో టాప్

image

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బంగారు తాకట్టు రుణాల మంజూరులో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచింది. 57,519 మంది దాదాపు రూ.765 కోట్ల మేర బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకున్నారు. మరో వారంలోగా ఇది రూ.800 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు అనందం వ్యక్తం చేశారు.