News March 25, 2024

28న సిద్దిపేటలో స్పాట్ అడ్మిషన్లు

image

సిద్దిపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఈనెల 28వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కవిత తెలిపారు. గ్రూప్ 1, 2, 3,4, ఎస్ఎసీసి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్సై, కానిస్టేబుల్ తదితర కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసం ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News July 8, 2024

SRD: ఇన్స్పైర్ మనక్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిధారెడ్డి తెలిపారు. జిల్లా విద్యాశాఖ నుంచి ప్రతి పాఠశాలకు పంపే ప్రత్యెక లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దీనిపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని, సెప్టెంబర్ 15 చివరి తేదని తెలిపారు.

News July 8, 2024

మెదక్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

image

మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులను స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు హాజరు కాగా ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులను ఆయా అధికారులకు బదిలీ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు విజ్ఞప్తులతో హాజరయ్యారు

News July 8, 2024

ఆషాడ మాసం వచ్చినా.. ఊపులేని వ్యవసాయం..!

image

సరైన వర్షాలు లేక చెరువులు, కుంటల్లో నీటి జాడ కరువైంది. మెదక్ జిల్లాలో జలాశయాల్లో నీరు లేకపోవడంతో పంటల సాగు చేపట్టిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతిసారి ఆషాడమాసం వచ్చేసరికి రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు చల్లడం వంటి వ్యవసాయ పనులు అన్ని పూర్తి చేసేవారు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటూ పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనాలు సమర్పించుకునేవారు. కానీ ఈసారి ఆషాడమాసం పూర్తిగా భిన్నంగా ఉందంటున్నారు.