News March 22, 2025

గద్వాల: ‘ఎవరైనా వేధిస్తే మాకు చెప్పండి’ 

image

గద్వాల మండలం గోనుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ మొగలయ్య హాజరై ప్రసంగించారు. షీటీం సేవల గురించి, వేధింపులకు గురైనప్పుడు షీటీంను సంప్రదించాల్సిన ఆవశ్యకత, విద్య ప్రాముఖ్యత తెలియజేశారు. మహిళలు తమ కాళ్లపై తాము ఆర్థికంగా నిలబడాలన్నారు.

Similar News

News February 24, 2026

MLG: ఇంటర్ విద్యార్థులూ.. ఇవి తప్పక తెలుసుకోండి..!

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా అధికారి వీరేందర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ వాచ్, సెల్‌ఫోన్లు, కెమెరాలు ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకురావద్దన్నారు. కాగా పరీక్షా కేంద్రానికి సుమారు 200 మీటర్ల వరకు ఎలాంటి జిరాక్స్ షాపులు కూడా తెరిచి ఉంచవద్దన్నారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు.

News February 24, 2026

క్వింటా రూ.5,875: కార్యదర్శి జయలక్ష్మి

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు కార్యదర్శి ఆర్.జయలక్ష్మి తెలిపారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నుంచి క్వింటాలుకు రూ.5,875 మద్దతు ధరతో శనగలు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ-క్రాప్ నమోదు సర్టిఫికెట్, తేమ శాతం పరీక్ష కోసం నమూనా తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 24, 2026

TPT: మోహన్ బాబు కాలేజీ అమ్మాయి సూసైడ్

image

తిరుపతిలో మరొక కాలేజీ యువతి చనిపోయింది. మంగళం ఏరియాకు చెందిన యువతి(22) మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాలేజీ బయటే ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఏమైందో ఏమో హాస్టల్లోనే ఉరివేసుకుంది. వెంటనే ఆమెను నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. జ్వరంతో నారాయణ కాలేజీ విద్యార్థిని <<19223316>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే.