News March 22, 2025
త్వరలో తెలంగాణ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన: జితేందర్ రెడ్డి

ఢిల్లీలో నిర్మించనున్న నూతన తెలంగాణ భవన్ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండబోతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి అన్నారు. అధికారులతో కలిసి ఆయన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ భవన్కు సంబంధించిన డిజైన్కు సీఎం అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి నాలుగేళ్లలో పూర్తి చేస్తామని జితేందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News March 24, 2025
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: ఏసర్ ఇండియా

తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఓ పెయిడ్ లీవ్ ఇవ్వనున్నట్లు ఏసర్ ఇండియా వెల్లడించింది. మాతృక పేరిట ప్రతి నెలా ఈ సెలవును అందిస్తామని తెలిపింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. L&T, స్విగ్గీ, జొమాటో కూడా ఈ తరహా లీవ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ ప్రభుత్వాలు సైతం ఈ సెలవును అమలు చేస్తున్నాయి.
News March 24, 2025
విమానం లేటైనా, రద్దైనా టికెట్ డబ్బులు వాపస్..

విమాన ప్రయాణికుల ముఖ్యమైన <<15872009>>హక్కులు<<>> * షెడ్యూలుకు 2వారాల నుంచి 24hrs లోపు రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదా డబ్బు పొందొచ్చు * అన్నీ సవ్యంగా ఉన్నా బోర్డింగ్ను నిరాకరిస్తే డబ్బు పొందొచ్చు * ఫ్లయిట్ 6hrs లేటైతే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదా పరిహారం, భోజనం పొందొచ్చు. 24hrs అయితే వసతి పొందొచ్చు. * లగేజ్ పోతే KGకి ₹3K, డ్యామేజ్ అయితే ₹1K వరకు పొందొచ్చు * ప్రమాదంలో చనిపోతే/గాయపడితే ₹20L పరిహారం వస్తుంది.
News March 24, 2025
శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు

AP: విశాఖ చినముషిడివాడలోని శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో ఉన్న 9 శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆదేశించింది. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని, తొలగింపు ఖర్చును మఠం నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.