News March 22, 2025
MBNR: నిరుద్యోగ యువతకు తప్పని సమస్య..!

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం కింద లబ్ధిపొందేందుకు రేషన్ కార్డు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పలువురు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసినప్పటికీ, పాత రేషన్ కార్డు తొలగించాల్సిన నిబంధనతో సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. పెళ్లయిన వారు తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లోనే కొనసాగుతుండడంతో కొత్త కార్డు పొందడానికి సమస్య ఎదురవుతోందని, దీంతో పథకానికి అప్లై చేయని పరిస్థితి నెలకొందన్నారు.
Similar News
News March 25, 2025
మహబూబ్నగర్: రెండు పథకాలు.. ఈనెల 31 లోపు ఖాతాల్లోకి డబ్బులు

సీఎం రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా, భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున మార్చి 31 లోపు జమ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రైతు భరోసా కోసం రూ.18,000 కోట్లు కేటాయించింది. ఉగాది పండుగ నాటికి అర్హులకు పూర్తిగా జమచేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.
News March 25, 2025
MBNR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు మేస్త్రీలుగా మహిళలు: కలెక్టర్

రాష్ట్రంలోనే మొదటిసారిగా వినూత్నంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు 41 మంది మహిళా మేస్త్రీలను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. సోమవారం బండమీదిపల్లిలోని నిర్మితి కేంద్రంలో నాక్ ద్వారా మహిళా సంఘాల సభ్యులు 41 మందిని ఎంపిక చేసి వారికి మేస్త్రీలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణ అనంతరం పనిలో రాణించాలన్నారు.
News March 25, 2025
క్షయ వ్యాధి నివారణలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉంది

క్షయ వ్యాధి నివారణలో చికిత్సను అందించడంలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. క్షయ నివారణలో జిల్లా అధికారులు ఎంతో క్రమశిక్షణతో పని చేస్తున్నారని ఈ సందర్భంగా అభినందించారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,087 మందికి టీబి చికిత్స అందించినట్లు వెల్లడించారు.