News March 22, 2025
సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిని గుర్తించండి: షబ్బీర్ అలీ

మిషన్ భగీరథ పైప్లైన్ పనులను వేగవంతం చేసి మున్సిపల్ ఏరియాలో రోజుకు రెండుసార్లు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. పట్టణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిని గుర్తించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రంజాన్ పండుగ సందర్భంగా నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 7, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఆచార్య NG రంగా 125వ జయంత్యుత్సవాలకు హాజరుకానున్న CM చంద్రబాబు
* వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రధాని పిలుపు మేరకు ఉ.9.50 గం.కు ప్రతి ఒక్కరం గేయాన్ని ఆలపిద్దాం: పవన్
* HYDలో జన్మించిన గజాలా హష్మీ వర్జీనియా గవర్నర్ కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం: CM చంద్రబాబు
* పోలవరం ప్రాజెక్ట్పై ఆ ప్రాజెక్ట్ అథారిటీ రెండ్రోజుల సమీక్ష. నేడు HYDలోని కార్యాలయంలో, రేపు ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలన
News November 7, 2025
సెలవులు రద్దు: కడప DEO

సెలవులపై కడప DEO షంషుద్దీన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఈ మూడు నెలల్లోని ఆయా శనివారాల్లో స్కూళ్లు ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ నేపథ్యంలో గత నెలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈక్రమంలో ఈ మూడు సెలవులను వర్కింగ్ డేస్గా ప్రకటించారు.
News November 7, 2025
బాలల హక్కులు, విద్యపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

నల్గొండ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
గురువారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు హరిత, చందనలతో ఆమె సమావేశమయ్యారు. విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడంతో విద్యా వ్యవస్థ బలోపేతమైందని కలెక్టర్ వెల్లడించారు. బాల్య వివాహాలు, శిశు విక్రయాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.


