News March 22, 2025
BREAKING: దిగ్గజ బాక్సర్ కన్నుమూత

ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్మెన్(76) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1968 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలవడంతో పాటు రెండు సార్లు హెవీ వెయిట్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు. తన కెరీర్లో 68 నాకౌట్లలో పాల్గొనగా ఐదింట్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. 1997లో బాక్సింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీతో 1974లో జరిగిన పోరులో ఓటమి పాలయ్యారు.
Similar News
News March 23, 2025
ఎయిర్ ఇండియాపై వార్నర్ ఆగ్రహం

విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రయాణించాల్సిన విమానం గంటకు పైగా ఆలస్యం కావడంతో ఆయన సంస్థపై మండిపడ్డారు. పైలట్ల కొరతతో ఫ్లైట్ ఆలస్యమవుతుందని తెలిసినా ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. కాగా ‘రాబిన్హుడ్’ మూవీ ప్రమోషన్ల కోసం వార్నర్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే.
News March 23, 2025
క్షమాపణల కంటే మరణాన్నే కోరుకున్న భగత్!

ఇంకెప్పుడూ హింసకు పాల్పడనని రాసిచ్చి క్షమాపణలు చెబితే వదిలేస్తామని బ్రిటిషర్లు భగత్సింగ్కు ఆఫర్ ఇచ్చారు. ‘వారికి క్షమాపణలు చెప్పడం కంటే చావే నాకు ఇష్టం’ అంటూ ఉరికంబాన్నే కోరుకున్నారాయన. ‘యంగ్ ఇండియా’ పుస్తకంలో గాంధీ భగత్ గురించి ప్రస్తావించారు. ‘భగత్ అసలు బతకాలని భావించలేదు. కనీసం అప్పీల్ కూడా చేయలేదు. <<15857764>>ఆ ముగ్గురూ<<>> మరణభయాన్ని జయించారు. ఆ ధీరత్వానికి మనం 1000సార్లు ప్రణమిల్లాలి’ అని రాసుకొచ్చారు.
News March 23, 2025
బ్లాక్లో SRH Vs RR మ్యాచ్ టికెట్లు.. 11మంది అరెస్ట్

ఇవాళ మధ్యాహ్నం జరగనున్న సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరంలో నలుగురు, మల్కాజిగిరిలో ముగ్గురు, ఎల్బీనగర్లో ముగ్గురు, భువనగిరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.