News March 22, 2025
పెద్దపల్లి: ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు యువకుడు బలి(అప్డేట్)

ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి(D) మంథని(M) విలోచవరానికు చెందిన కొరవేన సాయితేజ(26) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని KNRలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లో దశలవారీగా రూ.10లక్షలు పోగొట్టుకున్నాడని, అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 18న ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
HYD: 3 రోజులుగా అశోక్ ఆమరణ దీక్ష..!

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ సెప్టెంబర్ 15వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించగా, నేడు మూడో రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అందిస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, తక్షణమే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.
News September 17, 2025
ఆదిలాబాద్: రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది: ఎస్పీ

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్లోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నియంత పాలన అంతమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృతనిశ్చయంతో విధులు నిర్వహించాలన్నారు.
News September 17, 2025
ములుగు: బీఆర్ఎస్ నేత వ్యాఖ్యలపై రైతులు ఫైర్.. నిరసన ప్రదర్శనకు సన్నద్ధం!?

తన ఆస్తి మొత్తం ఇస్తా.. ములుగు కలెక్టర్ను వదిలిపెట్టొద్దంటూ బీఆర్ఎస్ నేత, విత్తన కంపెనీ ఏజెంట్ నర్సింహమూర్తి చేసిన వ్యాఖ్యలపై మొక్కజొన్న రైతులు ఫైర్ అవుతున్నారు. నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. నకిలీ విత్తనాల కారణంగా జిల్లాలో 671 మంది 1521 ఎకరాల్లో నష్టపోయారు. కలెక్టర్ దివాకర చొరవతో జులై 7న మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క చేతుల మీదుగా రూ.3.8 కోట్లు పరిహారం ఇచ్చారు.