News March 22, 2025
ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.
Similar News
News January 9, 2026
46 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు: డీఈవో

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం కలగకుండా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ, సెలవుల వల్ల ఏర్పడిన ఖాళీల్లో 46 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ డీఈవో చైతన్యజైనీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్, డిసెంబర్ నెలల ఖాళీలతో పాటు సెక్టోరల్ విభాగాల్లోని ఏఎంవో, జీసీడీవో స్థానాల్లోనూ నియామకాలు చేపట్టారు.
News January 9, 2026
ఖమ్మం: రోడ్డు ప్రమాదం.. విద్యుత్ శాఖ ఇంజినీర్ మృతి

ఖమ్మంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతకాని విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ పి. సందీప్ రెడ్డి మృతి చెందారు. విధి నిర్వహణ ముగించుకుని బైక్పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి మృతితో ఆయన కుటుంబంలో, విద్యుత్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
News January 9, 2026
సత్తుపల్లి జిల్లా ఆశలు.. మంత్రి పొంగులేటిపైనే..!

1997లో మొదలైన సత్తుపల్లి జిల్లా ఉద్యమం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. నాటి ఉద్యమ సారథి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రాష్ట్ర మంత్రిగా ఉండటంతో జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. నాడు జిల్లా ఆవశ్యకతపై ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆయన, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేగవంతం చేస్తున్నారు. ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ ‘తీపి కబురు’ ఎప్పుడు వింటామా స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


