News March 22, 2025
ప్రకాశం: బెట్టింగ్ వేయకండి.. కాల్ చేయండి

ఐపీఎల్ వినోదం ఇవాళ్టి నుంచే మొదలు కానుంది. ఈక్రమంలో బెట్టింగ్ భూతం భయపడుతోంది. ఒంగోలు నగరంతో పాటు మారుమూల పల్లెల్లోని యువతను సైతం బెట్టింగ్లోకి లాగడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే ఎవరైనా సరే 100, 112 నంబర్లతో పాటు 91211 02266కు కాల్ చేయాలని ఎస్పీ దామోదర్ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ జోలికి వెళ్లకండి.
Similar News
News March 25, 2025
ఒంగోలు: ‘ఫిర్యాదులు సత్వరమే పరిష్కరిస్తాం’

ప్రజల నుంచి వచ్చే పిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమన్ని జిల్లా ఎస్పీ దామోదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. 81 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
News March 24, 2025
KG చికెన్కు రూ.10టాక్స్.. ఇదేనా విజన్: తాటిపర్తి

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరోసారి వ్యంగ్యంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘విజన్ -2047 అంటే KG చికెన్కు రూ.10 L&P టాక్స్ కట్టడం. L&P టాక్స్ ఎలా అమలు చేయాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. కావాలంటే తెలుసుకోండి. భవిష్యత్లో ప్రతి కేజీ చికెన్పై దోపిడీకి జేబులు సిద్ధం చేసుకోవాలని ప్రజలకు నా విన్నపం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
News March 24, 2025
ఒంగోలులో ESI ఆసుపత్రి స్థాపించాలి: మాగుంట

ఒంగోలులో ESI ఆసుపత్రిని స్థాపించాలని పార్లమెంట్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. రూల్ నం. 377 క్రింద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 3003 కర్మాగారాలలో 86000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారని, వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపించాలని మాగుంట కోరారు.