News March 22, 2025
MBNR: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT
Similar News
News January 28, 2026
కురుమూర్తి దేవస్థానంలో స్వామివారి దిగుడుమెట్లు ప్రారంభం

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ శివారులో శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో స్వామివారి దిగుడుమెట్లు దాతల సహకారంతో బుధవారం ప్రారంభించారు. దేవాలయం ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సత్యనారాయణ, శ్రీనివాసులు ఆలయ సిబ్బంది ఆర్.శివానంద చారి, భాస్కర చారి తెలుగు శ్రీనివాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
News January 28, 2026
MBNR: పుర పోరు..అభ్యర్థుల డిపాజిట్ ఇలా..!

ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీల్లో పోటీచేసే SC,ST,BC అభ్యర్థులు రూ.1,250,ఇతరులు రూ.2,500 డిపాజిట్ చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్లలో పోటీచేసే రిజర్వ్డ్ కేటగిరీఅభ్యర్థులు రూ.2,500, జనరల్ రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు పొందే అభ్యర్థులు నామినేషన్ ఫారంతోపాటు తప్పనిసరిగా కుల ధ్రువీకరణపత్రాన్ని జతచేయాలి.
News January 28, 2026
నేటి నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సలు.. వాహనాల నియంత్రణ

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించినట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ శ్రీ అళహరి మధుసూదన్ Way2News తెలిపారు. భక్తులు నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలుపాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ మినీ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


