News March 22, 2025

నారాయణపేట: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

image

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT

Similar News

News January 13, 2026

స్వర్ణ నారావారిపల్లెలో DRDA ఆధ్వర్యంలో రుణాలు

image

స్వర్ణ నారావారిపల్లెలో భాగంగా DRDA ఆధ్వర్యంలో సున్న వడ్డీకి రుణాలు మంజూరు చేయించి, జ్యూట్ మెషిన్స్-2, ఈ- ఆటోలు 5, మిల్లెట్ కార్ట్ 2, 1 కొర్రమీను ఫిష్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వీటి విలువ రూ. 27,25,750 ఉండగా, 11 మంది లబ్ధిదారులు ఉన్నారు. PMEGP ద్వారా రూ. 17.5 లక్షలు విలువ చేసే 3 ఆవులు, చేపల పెంపకానికి రూ. 4.5 లక్షలు, మిల్లెట్ కార్ట్‌లకు రూ. 2.34 లక్షలు మంజూరు చేశారు.

News January 13, 2026

యూపీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా!

image

సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ రేపు విడుదల కావాల్సింది. కానీ అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. కాగా ప్రిలిమ్స్ పరీక్ష మే 24న, మెయిన్స్ ఆగస్టు 21న నిర్వహిస్తామని గతంలో యూపీఎస్సీ ప్రకటించింది.

News January 13, 2026

TTD ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మాణం

image

TTD ఆధ్వర్యంలోని SV బధిర హైస్కూల్, జూనియర్ కళాశాల, ITI, శ్రవణం, బాల మందిరాన్ని ఓకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. ప్రస్తుతం విడివిడిగా ఉన్న వీటిని ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మాణం చేసి అక్కడ పెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అలిపిరి జూపార్క్ రోడ్డులో స్థలం కోసం పరిశీలన చేశారని తెలుస్తోంది. ఆ క్యాంపస్‌కు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలపై ఇప్పటికే నివేదిక ఆమోదం లభించిందని తెలుస్తుంది.