News March 22, 2025
ఫోన్ చూస్తూ తింటున్నారా.. జాగ్రత్త!

చాలామందికి తినే సమయంలోనూ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ప్లేటులో ఏముందో కూడా పట్టించుకోకుండా తినేవారు ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తినే ప్రతి ముద్దను ఆస్వాదిస్తే అరుగుదల మెరుగ్గా ఉంటుంది. దృష్టి ఫోన్పై ఉంటే ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా మనకు తెలీదు. దీని వల్ల పోషకాహార లోపమో లేక ఊబకాయం రావడమో జరుగుతుంది. రెండూ ప్రమాదమే’ అని వివరిస్తున్నారు.
Similar News
News March 24, 2025
హోరెత్తిస్తున్న షేర్లు: రూ.5లక్షల కోట్ల లాభం

స్టాక్మార్కెట్లు దూకుడు మీదున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ దుమ్మురేపుతున్నాయి. MON మిడ్ సెషన్కు నిఫ్టీ 23,616 (+270), సెన్సెక్స్ 77,834 (+930) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.5లక్షల కోట్లమేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, FIIs తిరిగి పెట్టుబడులు ఆరంభించడం, డాలర్తో రూపాయి బలపడుతుండటం, బ్యాంకింగ్ స్టాక్స్ జోరు, ఇన్వెస్టర్ల విశ్వాసం పెరగడమే ఇందుకు కారణాలు.
News March 24, 2025
మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28న నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఇటీవల రాష్ట్రంలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
News March 24, 2025
ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలే.. త్వరలో ‘ది రాజాసాబ్’ టీజర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రఫ్ కట్ వీడియోను ఇండస్ట్రీ మిత్రులకు మారుతి చూపించగా.. ఫ్రభాస్ను ఇలా ఎప్పుడూ చూడలేదని అందరూ చెప్పినట్లు సినీవర్గాల్లో టాక్. డైలాగులు, ప్రభాస్ లుక్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తాయని సమాచారం. ఈ చిత్రం సర్ప్రైజింగ్ విజువల్ ట్రీట్ ఇవ్వనుందని సినీవర్గాలు తెలిపాయి.