News March 22, 2025
NGKL: ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అంబేడ్కర్ ఓవర్సీస్ ఉపకార వేతనాల కోసం నాగర్ కర్నూల్ జిల్లాలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి పీవీ శ్రావణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆర్థిక సహాయం పొందడానికి ఈ పాస్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్ తదితర దేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 2, 2026
శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: కలెక్టర్

శాసనసభ సభాపతి పదవికి దుద్దిళ్ల శ్రీపాదరావు వన్నె తెచ్చారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీఓ వీణ, డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
News March 2, 2026
సత్యసాయి జిల్లా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ

జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో 2026-27 సంవత్సరానికి సంబంధించిన అక్రిడేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. నియమావళి ప్రకారం అర్హులందరికీ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. తొలి విడతలో 435 కార్డులు అందజేస్తున్నామని, మిగిలిన వారికి రెండో విడతలో ఇస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సమాచారశాఖ అధికారులు పాల్గొన్నారు.
News March 2, 2026
కర్నూలు @ 36°C

కర్నూలు జిల్లాలో ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కర్నూలులో గరిష్ఠంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


