News March 22, 2025

10వ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జనగామ కలెక్టర్

image

జనగామ పట్టణ కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు సూచించారు. సహాయ సంచాలకులు రవి కుమార్, చీఫ్ సూపరింటెండెంట్ శోభన్, సత్యనారాయణ తదితరులున్నారు.

Similar News

News September 15, 2025

పాడి పశువుల్లో పాలజ్వరం – లక్షణాలు

image

ఈ వ్యాధి అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయకపోవడం, నెమరు వేయకపోవడం, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి.. S ఆకారంలో మగతగా పడుకొని ఉండటం పాల జ్వరంలో కనిపించే ప్రత్యేక లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది.

News September 15, 2025

పాడిపశువుల్లో పాలజ్వరం నివారణకు సూచనలు

image

పాలిచ్చే పశువులు చూడి దశలో ఉన్నప్పుడే దాణాలో సరిపడా కాల్షియం ఉండేలా చూసుకోవాలి. లెగ్యూమ్‌ జాతి పశుగ్రాసాలు, పచ్చిమేతలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మేతలో తులసి, అవిసె, మల్బరీ, సుబాబుల్‌, మునగ వంటి ఆకుల్ని కలపడం వల్ల చాలావరకు పోషకాహార లోపాలను నివారించవచ్చు. పశువులు ఈనే 5 రోజుల ముందు నుంచి విటమిన్-డి ఇంజెక్షన్లు, ఈనిన వెంటనే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు వెటర్నరీ నిపుణుల సూచనతో ఇవ్వాలి.

News September 15, 2025

KNR: గుడ్ న్యూస్.. వారంలో 5 రోజులు తిరుపతికి రైళ్లు

image

ఉమ్మడి కరీంనగర్ ప్రయాణికులకు వారంలో ఐదు రోజులపాటు తిరుపతికి వెళ్లేందుకు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. KNR నుంచి తిరుపతికి ఆది, గురువారాల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, మంగళవారం నాందేడ్ నుంచి తిరుచానూర్‌కు వీక్లీ స్పెషల్ రైలు తిరుపతి మీదుగా నడవనున్నాయి. శుక్రవారం నాందేడ్ నుంచి ధర్మవరం, శనివారం నాందేడ్ నుంచి తిరుపతి రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లకు KNR, PDPL, జమ్మికుంట స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు.