News March 25, 2024
సొంత గ్రౌండ్స్లో ఐపీఎల్ టీమ్స్ ఆధిపత్యం

ఈ ఏడాది ఐపీఎల్లో 5 మ్యాచులు పూర్తయ్యాయి. అన్నింటిలోనూ విజయం హోం గ్రౌండ్ జట్లకే దక్కింది. చెన్నైలో జరిగిన మ్యాచ్లో సీఎస్కే, పంజాబ్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్, రాజస్థాన్లో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్, అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందాయి. ఇక నేడు బెంగళూరులో ఆర్సీబీ, పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్లో ఇది కొనసాగుతుందో లేదో చూడాలి.
Similar News
News April 21, 2025
‘ఖురేషీ’ ముస్లిం ఎన్నికల అధికారి .. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ SY ఖురేషీపై BJPఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఖురేషీ కమిషనర్గా ఉన్నకాలంలో ఝార్ఖండ్ సంతాల్ పరగణాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చారని, ఆయన ముస్లిం ఎన్నికల కమిషనర్ అని’ Xలో ఆరోపించారు. కాగా వక్ఫ్ చట్టం ముస్లిం భూములను లాక్కోవడానికి చేసిన ప్లాన్ అని సుప్రీం కోర్టు దానిని గుర్తిస్తుందని ఖురేషీ చేసిన ట్వీట్కు ఎంపీ రిప్లై ఇచ్చారు.
News April 21, 2025
ఈ వారంలో ‘కింగ్డమ్’ ఫస్ట్ సింగిల్: నాగవంశీ

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్డమ్’ మూవీపై నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News April 21, 2025
ఏప్రిల్ 21: చరిత్రలో ఈరోజు

✒ 1910: ప్రముఖ US రచయిత మార్క్ ట్వెయిన్ మరణం
✒ 1938: ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ మరణం
✒ 1939: తెలుగు రంగస్థల నటుడు భాను ప్రకాశ్ జననం
✒ 2000: బాలీవుడ్ నటి నిగర్ సుల్తానా మరణం
✒ 2013: గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి మరణం(ఫొటోలో)
✒ 2022: రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకరరావు మరణం
✒ నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం