News March 22, 2025

ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు 38 కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 1,337 మందికి గాను 1,335 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 8 మందికి గాను ముగ్గురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 1,345 మందికి గాను 1,338 మంది పరీక్షలకు హాజరు కాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని తెలిపారు.

Similar News

News March 25, 2025

రాయికల్: అక్రమ ఆయుధం విక్రయ యత్నం.. పట్టుకున్న పోలీసులు

image

అక్రమ ఆయుధాన్ని విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు SI సుధీర్ రావు తెలిపారు. SI వివరాలిలా.. UP కి చెందిన పవన్, సునీల్ లు రాయికల్ (m) బషీర్ పల్లెలో ఉంటూ లేబర్ పని చేస్తూ బతుకుతున్నారు. వారు UP నుండి అక్రమంగా ఒక తపంచా తెచ్చారు. సునీల్ తపంచాను అమ్మమని పవన్‌కు ఇచ్చి వెళ్ళాడు. పవన్ రామాజీపేటలో నేడు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా తపంచా, లైన్ రౌండ్ పట్టుకొని సీజ్ చేశారు.

News March 25, 2025

నేను క్షమాపణ చెప్పను: కునాల్ కమ్రా

image

మహారాష్ట్ర Dy.CM ఏక్‌నాథ్ షిండేపై తాను చేసిన వ్యాఖ్యలను కమెడియన్ <<15868229>>కునాల్ కమ్రా<<>> సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పబోనని ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భావ వ్యక్తీకరణ హక్కు అనేది శక్తివంతమైన వారిని ప్రశంసించడానికి మాత్రమే కాదు. రాజకీయ నేతలపై వ్యంగ్యంగా మాట్లాడడం చట్టవిరుద్ధం కాదు. షిండే గురించి అజిత్ పవార్ ఏం అన్నారో అదే నేనూ చెప్పాను. అయినా పోలీసులు, కోర్టుకు సహకరిస్తాను’ అని పేర్కొన్నారు.

News March 25, 2025

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. భారత్‌కు షాక్?

image

US అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వెనెజువెలా నుంచి చమురును కొనే దేశాలు ఇకపై తమతో చేసే ఏ వాణిజ్యంలోనైనా 25శాతం అదనపు సుంకం కట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆ దేశం అమెరికాకు శత్రుత్వం పాటిస్తోందని వివరించారు. వెనెజువెలా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం భారత్‌కు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది.

error: Content is protected !!