News March 22, 2025

SSR-దిశ డెత్ కేసు: మాజీ CM కుమారుడి టెన్షన్

image

SSR-దిశా సాలియాన్ డెత్ కేసుల్లో మహారాష్ట్ర మాజీ CM ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, MLA ఆదిత్య ఠాక్రే చక్రవ్యూహంలో చిక్కుకున్నారు. దిశది సూసైడ్ కాదని, మర్డర్ చేశారని తండ్రి సతీశ్ ఆరోపిస్తున్నారు. 2020, JUNE 8న ఆమె మరణించినప్పుడు తనను కొందరు మెంటల్ కస్టడీలోకి తీసుకొని నోరు మూయించారని చెప్పారు. ఆదిత్యకు కేసుతో సంబంధం ఉందని, ఆయన సాక్ష్యాధారాలను మాయం చేశారని ఆరోపించారు. ఆ రోజు ఎక్కడున్నారో ఆదిత్య చెప్పడం లేదు.

Similar News

News November 7, 2025

నైట్ షిఫ్ట్ ఒత్తిడి తట్టుకోలేక 10 మందిని చంపేసిన నర్సు!

image

నైట్ షిఫ్టులతో విసుగు చెందిన ఓ నర్సు (Male) హైడోస్ ఇంజెక్షన్లు ఇచ్చి 10 మందిని చంపిన ఘటన జర్మనీలోని వుయెర్సెలెన్ ఆసుపత్రిలో జరిగింది. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇలా చేసినట్లు అతడు ఒప్పుకోవడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడు మరో 27 మందిని హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. కాగా గతంలో నిల్స్ హెగెల్ అనే మరో నర్సు కూడా 85 మందిని హత్య చేశాడు.

News November 7, 2025

సినిమా అప్డేట్స్

image

* మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ అరుదైన ఘనత సాధించింది. లాస్‌ఏంజెలిస్‌లోని ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’లో వచ్చే ఏడాది FEB 12న ప్రదర్శితమవనుంది.
* పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన ‘విలాయత్ బుద్ధ’ మూవీ ఈ నెల 21న రిలీజవనుంది.
* దివంగత మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో ‘మైఖేల్’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆయన సోదరుడు జెర్మైన్ జాక్సన్ కుమారుడు జాఫర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

News November 7, 2025

పెరిగిన ఓటింగ్.. మార్పుకు సంకేతమా..?

image

బిహార్ తొలిదశ ఎన్నికల్లో 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. భారీ ఓటింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. అధికారపక్షంపై అసహనం, ఆగ్రహం అధికంగా ఉంటే ఓటర్లూ అదేస్థాయిలో పోలింగ్ స్టేషన్లకు వస్తారన్నారు. 1998సం.లో (MP ఎన్నికలు) తొలిసారి 64%, 2000లో 62% ఓటింగ్ నమోదవగా అప్పుడు అధికార బదిలీ జరిగింది. ఈసారి ఇది రిపీటవుతుందా?