News March 22, 2025
దిశా సాలియాన్ డెత్ కేసు: APRIL 2న విచారణ

నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ EX మేనేజర్ దిశా సాలియాన్ డెత్ కేసులో ఆమె తండ్రి వేసిన రిట్ పిటిషన్ను APRIL 2న విచారిస్తామని బాంబే హైకోర్టు తెలిపింది. 2020, జూన్ 8న తన కుమార్తె మరణించిన తీరుపై మళ్లీ దర్యాప్తునకు ఆదేశించాలని సతీశ్ సాలియాన్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. SSR మృతికీ దీనికీ సంబంధం ఉందని, అప్పటి CM ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే సాక్ష్యాలను తారుమారు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
Similar News
News November 11, 2025
యూజర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్టెల్

ఎయిర్టెల్ తన రూ. 189 వాయిస్-ఓన్లీ ప్లాన్ను రద్దు చేసి యూజర్లకు షాక్ ఇచ్చింది. ఈ మార్పు ఓన్లీ కాలింగ్ ఫీచర్ కావాలనుకునే వారికి భారంగా మారనుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ ఎంట్రీ-లెవల్ ప్లాన్ రూ. 199గా మారింది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ & 2GB డేటాను అందిస్తుంది. ఇంటర్నెట్ అవసరం లేని యూజర్లకు రూ. 189 అపరిమిత కాలింగ్ ప్లాన్ సౌకర్యంగా ఉండేది.
News November 11, 2025
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఎంతంటే?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ మాత్రమే నమోదైంది. చాలామంది ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఏ అభ్యర్థీ నచ్చకపోతే నోటాకు కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన యూపీ మహిళ Dr.షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.


