News March 22, 2025
ఎర్త్ అవర్ విధిగా పాటించండి: గవర్నర్

నేడు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపివేసి ఎర్త్ అవర్ విధిగా పాటించాలంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. “వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్” పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని గవర్నర్ సూచించారు.
Similar News
News September 13, 2025
గోదావరిఖని: ఈనెల 23న GOAకు స్పెషల్ బస్

ఈనెల 23న గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ నుంచి గోవా స్పెషల్ ప్యాకేజీ కింద రాజధాని ఏసీ బస్ వెళ్తుందని డీపో మేనేజర్ శుక్రవారం తెలిపారు. మురేడేశ్వర్, గోకర్ణ, గోవాను చూసుకొని 28న బస్సు తిరిగి గోదావరిఖనికి చేరుకుంటుందన్నారు. ఒక్కరికి రూ.8,000లుగా టికెట్ ఛార్జీ నిర్ణయించామన్నారు. రిజర్వేషన్ కోసం 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News September 13, 2025
వరంగల్: మత్తు పదార్థాలపై కఠిన చర్యలు

గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా నిల్వపై విశ్వసనీయ సమాచారం అందించాలని వరంగల్ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, అమ్మకందారులు లేదా తరలింపులో ఉపయోగించే వాహనాలపై ఎవరైనా సమాచారం కలిగి ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు. దీనికోసం టోల్ఫ్రీ నంబర్ 1908 లేదా 87126 71111 ద్వారా అందించవచ్చు అన్నారు.
News September 13, 2025
నెల్లూరు: ఆ బార్లకు రీ నోటిఫికేషన్

జిల్లాలో నిర్వహించకుండా ఓపెన్ కేటగిరిలో ఉన్న 32 బార్లకు, గీత కులాల రిజర్వుడు కింద ఉన్న 1 బార్ కి సంబంధించి రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా నిషేధ, ఎక్సైజ్ శాఖాధికారి తెలిపారు. ఈ నెల 17న దరఖాస్తుల స్వీకరణ, 18 న లాటరీ, ఎంపిక ప్రక్రియలను చేపట్టానున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఈ మార్పు చేసిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు చేయాలని కోరారు