News March 22, 2025
విశాఖ: కళాకారులకు జిల్లాస్థాయి అవార్డులు

విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులను ఆదివారం కళా ప్రవీణ 2025 పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కే జనార్ధన్ పేర్కొన్నారు. శనివారం వారు మహారానిపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా నుంచి గుర్తింపు పొందిన కళాకారులను ఎంపిక చేసి స్థానిక కళ్యాణ మండపంలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
భీమిలి బీచ్లో నిర్మాణాల తొలగింపు

భీమిలి బీచ్లోని కోస్తా నియంత్రణ మండలి పరిధిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ నిర్మించిన ప్రహరీ, వాటి పునాదుల తొలగింపునకు జీవీఎంసీ సుమారు రూ.కోటి వెచ్చిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించి ఈ నెల 26 కల్లా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో జీవీఎంసీ అధికారులు విరామం లేకుండా యంత్రాలతో పనిచేయిస్తున్నారు.
News March 25, 2025
విశాఖ: 30 మంది అనాథ చిన్నారులకు మ్యాచ్ చూసే అవకాశం

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరగనున్న మ్యాచ్ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 30 మంది అనాథ చిన్నారులకు చూసే అవకాశం కల్పించింది. సొంత నిధులతో 30 టికెట్స్ కొని వైజాగ్లోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియంకు వచ్చారు.
News March 24, 2025
విశాఖ: IPL మ్యాచ్ వీక్షించిన గవర్నర్

విశాఖలో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయనకు ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, ఎంపీ సానా సతీష్ స్వాగతం పలికారు. స్టేడియంలో చేసిన ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 30 మంది అనాథ పిల్లలకు మ్యాచ్ చూసే అవకాశం కల్పించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ను గవర్నర్ అభినందించారు.