News March 22, 2025
విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

AP: విశాఖ మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలుగా కూటమి నేతలు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో YCPకి షాక్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. GVMCలో 98 స్థానాలుండగా, YCP 59 చోట్ల గెలిచింది. ఈ 9 నెలల్లో 28 మంది కూటమి పార్టీల్లో చేరడంతో YCP బలం పడిపోయింది. మేయర్కు నాలుగేళ్ల పదవీకాలం పూర్తవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది.
Similar News
News March 25, 2025
దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

విదేశీ పెట్టుబడుల వెల్లువ, అమెరికా మార్కెట్ల ర్యాలీ దృష్ట్యా భారత మదుపర్ల సానుకూల సెంటిమెంట్తో సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్తున్నాయి. 30 షేర్ BSE బెంచ్మార్క్ సెన్సెక్స్ 418.54 పాయింట్లు లాభపడి 78,402.92కు చేరుకుంది. ఇక NSE నిఫ్టీ 107.85 పాయింట్లు పెరిగి 23,766.20 వద్ద ఉంది. సెన్సెక్స్లో అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, HCL టెక్, TCS, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ మహీంద్రా, మారుతి బాగా లాభపడ్డాయి.
News March 25, 2025
ఏప్రిల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: చంద్రబాబు

AP: ఏప్రిల్ మొదటివారంలో DSC నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తాం. 2027నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్తో అమరావతిని అభివృద్ధి చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
News March 25, 2025
రైతుల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ అవుతున్నాయి: SC

దేశంలో రైతుల బలవన్మరణాల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువవుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021లో 13000 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొంది. వాటి నివారణకు నేషనల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. 2023లో ఢిల్లీ ఐఐటీలో ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్న కేసు నేపథ్యంలో సుప్రీం ఈమేరకు వ్యాఖ్యానించింది.