News March 22, 2025

జగిత్యాల: హిందీ పరీక్షకు 8 మంది విద్యార్థులు గైర్హాజరు

image

పదోతరగతి రెండోరోజు హిందీ పేపర్ రెగ్యులర్‌కు 11,849 విద్యార్థులకు 11,841 విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యూలర్ విద్యార్థుల హాజరుశాతం 99.93% సప్లిమెంటరీ విద్యార్థులు 4 విద్యార్థులకు 3 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి హాజరుశాతం 75% అని అధికారులు తెలిపారు.

Similar News

News March 25, 2025

హుస్సైనీ మృతిపై పవన్ స్పందన ఇదే..

image

AP: తన గురువు <<15878066>>షిహాన్ హుస్సైనీ<<>> మృతిపై Dy.CM పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘హుస్సైనీ తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. 4 రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి విదేశాల్లో మెరుగైన వైద్యం చేయిస్తానని తెలిపాను. ఈ నెల 29న వెళ్లి పరామర్శించాలనుకున్నాను. ఈలోపే ఇలా జరగడం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని పేర్కొన్నారు.

News March 25, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,290గా ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,10,000గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది.

News March 25, 2025

MLAలు పార్టీ మారి వార్షికోత్సవం పూర్తైంది: సుప్రీం

image

TG: పార్టీ మారిన MLAల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రతివాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘MLAలు పార్టీ మారి ఇప్పటికే వార్షికోత్సవం పూర్తైంది. రీజనబుల్ టైమ్ అంటే వారి పదవీకాలం పూర్తయ్యేవరకా? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోతే పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేసినట్లే. ఆలస్యం చేసే ఎత్తుగడలు వేయొద్దు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలి’ అని ప్రభుత్వ తరఫు లాయర్‌ను ఆదేశించింది.

error: Content is protected !!