News March 22, 2025
మెదక్: జిల్లాలో రెండో రోజు టెన్త్ పరీక్షలు ప్రశాంతం

పదో తరగతి పరీక్షలు మెదక్ జిల్లాలో రెండవ రోజు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకుల కళాశాల, పాఠశాల ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జిల్లాలో మొత్తం 10,384 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 10,364 మంది విద్యార్థులు హాజరయ్యారు. 20 మంది విద్యార్థులు 99.80 % గైర్హాజరయ్యారు.
Similar News
News July 7, 2025
తూప్రాన్: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు గురుకుల విద్యార్థులు

తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తారా సింగ్ తెలిపారు. గురుకుల కళాశాల విద్యార్థులు రాకేశ్, విష్ణు శ్రీ చరణ్ ఇరువురు డెహ్రాడూన్లో ఈ నెల 12 నుంచి జరిగే రగ్బీ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రిన్సిపల్తో పాటు వైస్ ప్రిన్సిపల్ సుహాసిని, పీఈటీ రమేశ్, పీడీ నవీన్ విద్యార్థులను అభినందించారు.
News July 7, 2025
మెదక్: కుంటుంబం చెంతకు తప్పిపోయిన బాలుడు

మెదక్ పట్టణానికి చెందిన <<16899428>>వాసిప్ హుస్సేన్<<>> మానసిక స్థితి సరిగ్గా లేక వారం రోజుల కింద తప్పిపోయాడు. Way2Newsలో వచ్చిన కథనంతో తప్పిపోయిన బాలుడు కుటుంబం చేంతకు చేరాడు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్లో సంచరిస్తున్న బాలుడిని గ్రామస్థులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
News July 6, 2025
జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఖాజాపూర్ వాసి ఎంపిక

జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్కి చెందిన విష్ణు శ్రీ చరణ్ ఎంపికైనట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గణేశ్, రవికుమార్, మల్లీశ్వరి తెలిపారు. జులై 12, 14వ తేదీల్లో దెహ్రదూన్లో జరిగే జాతీయ రగ్బీ పోటీలలో చరణ్ పాల్గొనున్నట్లు వారు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన చరణ్ను గ్రామస్థులు అభినందించారు.