News March 22, 2025
స్థల వివాదంతోనే హత్య: ఎస్సై జగన్మోహన్

బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురం గ్రామంలో నంద్యాల సుధాకర్ రెడ్డిని దారుణ హత్య చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి, గుర్రాల రామ స్వామిలకు ఇంటి స్థలం విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, దాని కారణంగానే దారుణ హత్య చేశారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు. గుర్రాల రామస్వామి, అతడి ఇద్దరు కుమారులు గుర్రాల శివ, గుర్రాల తిరుపాలు కలిసి హత్య చేశారని చెప్పారు.
Similar News
News March 25, 2025
ఆ YCP నేతకు తాడిపత్రిలోకి NO ENTRY

తాడిపత్రికి చెందిన YCP ముస్లిం మైనార్టీ నేత ఫయాజ్ బాషాను పది రోజులపాటు తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు బహిష్కరించారు. గత 3రోజుల క్రితం ఫయాజ్ బాషా, JC ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా.. ఎలాంటి అల్లర్లు జరగకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫయాజ్ బాషాను పోలీసులు అనంతపురం తరలించారు.
News March 25, 2025
IPL.. వ్యూస్లో తగ్గేదే లే!

IPL మ్యాచ్లు భారీగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ నెల 22న KKR, RCB జట్ల మధ్య మ్యాచ్తో సీజన్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 4 మ్యాచులు అలరించాయి. కాగా, స్టార్స్పోర్ట్స్లో 25.3 కోట్లు, జియో హాట్స్టార్లో 137 కోట్ల వ్యూస్ వచ్చినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అలాగే 5K కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదైనట్లు వెల్లడించాయి. ధనాధన్ ఆటతో అలరిస్తున్న IPL ఏటికేడు భారీ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటోంది.
News March 25, 2025
పాడేరు: అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

పాడేరు, చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు-7, ఆయాలు-56, మినీ అంగన్వాడీ కార్యకర్తలు-27, పీఎం జనమన్ స్కీంలో కొత్తగా మంజురైన అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలు-24 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈనెల 26 నుంచి వచ్చేనెల 10లోగా ఐసీడీఎస్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.