News March 22, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

*గుంటుపల్లి మైనర్ బాలిక ప్రతిభ చూపిన పోలీసులకు జిల్లా ఎస్పీ ప్రశంసలు
* సారా రహిత జిల్లా లక్ష్యం ఎక్సైజ్ జిల్లా అసిస్టెంట్ సూపర్డెంట్ అజయ్ కుమార్ సింగ్
* దిశా సమీక్షలో పాల్గొన్న ఎంపీ మహేశ్, ఎమ్మెల్యేలు అధికారులు
* కోకో రైతుల సమస్యలు పరిష్కరించాలి
* టి.నర్సాపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలరాజు
* జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ బస్సు సర్వీస్ ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే

Similar News

News March 28, 2025

HYDలో నీటి ఎద్దడికి ఈ ఫొటో నిదర్శనం

image

ఈ దృశ్యం HYD శివారు మేడ్చల్‌లోని మూడుచింతలపల్లిలో నీటి ఎద్దడికి నిదర్శనం. మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ రాకపోవడంతో అక్కడ నివసించే మహిళలు కాలినడకన చిన్నపిల్లలతో సహా బిందెలు, డబ్బాలతో దూరప్రాంతాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఏడాది నుంచి ఈ సమస్య ఇలాగే ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు తమ గోడు వినిపించదా మమ్మల్ని పట్టించుకోరా? అని మండిపడుతున్నారు.

News March 28, 2025

పూరీ జగన్నాథ్ సినిమాకు నో చెప్పాను: రకుల్

image

తన కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్ని వదులుకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘కాలేజీలో చదువుకుంటున్న సమయంలో మోడలింగ్ చేశా. కన్నడ పరిశ్రమలో తొలి ఆఫర్ వచ్చింది. అది రిలీజయ్యాక పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. 70 రోజులు డేట్స్ కావాలన్నారు. అప్పటికి చదువుకుంటుండటంతో 4 రోజులు మాత్రమే ఇవ్వగలనన్నాను. అదే తరహాలో చాలా సినిమాల్ని వదులుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

రూ.165 లక్షలతో ఆరోగ్య సేవల మెరుగు..IOCL

image

ఇండియన్ ఆయిల్ TAPSO HYDలో ఆరోగ్య సేవలను మెరుగుపర్చేందుకు 3 ఒప్పందాలు కుదుర్చుకుని రూ.165 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ నిధులతో స్వీకార్ అకాడమీలో ఆటిజం బాధిత పిల్లలకు ప్రత్యేక సంరక్షణ, కోఠిలో ప్రభుత్వ ENT ఆసుపత్రిలో వినికిడి లోపం ఉన్నవారికి అవసరమైన పరికరాలు, మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్, వైద్య పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

error: Content is protected !!