News March 22, 2025
మెదక్: ఫారెస్ట్లో బ్రిడ్జి కండిషన్ పరిశీలించిన కలెక్టర్

మెదక్- సిద్దిపేట్ నేషనల్ హైవేలో తొనిగండ్ల వద్ద ఫారెస్ట్లో బ్రిడ్జి కండిషన్ కలెక్టర్ రాహుల్ రాజ్పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని పటిష్టంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక రోడ్డు త్వరగా ఏర్పాటు చేయాలని ఆధికారులు ఆదేశించిరు. కొత్తగా నిర్మించే బ్రిడ్జ్కు త్వరగా అన్నీ అనుమతులు తీసుకుని వేగంగా వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలన్నారు.
Similar News
News March 25, 2025
మెదక్ పట్టణంలో ATM వద్ద మోసాలు.. జాగ్రత్త

మెదక్లో ఓ బ్యాంక్ ATM వద్ద ఇద్దరు వ్యక్తులు డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ATM వద్ద నిలబడి ఎవరికైతే డబ్బులు డ్రా చేయడం రాదో వారినే టార్గెట్ చేస్తూ డబ్బులు తీసి ఇస్తానని చెప్పి కార్డును మార్చేస్తున్నారు. తన దగ్గర ఉన్న మరో కార్డును వారికిచ్చి అక్కడ నుంచి వెళ్లి వేరే ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేస్తున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ కొత్త తరహా మోసాలతో జాగ్రత్తంగా ఉండాలన్నారు.
News March 25, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళపై అత్యాచారం

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కంది మండలం మామిడిపల్లి పరిధిలో మంగళవారం తెల్లవారుజామున మహిళ(30)పై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆమె భర్త పైనా నిందితులు దాడి చేశారు. భర్తతో కలిసి ఆటోలో వెళ్తుండగా దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 25, 2025
మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. చిలప్ చెడ్ 36.8, కుల్చారం 36.7, వెల్దుర్తి 36.5, మెదక్ 36.4, పాపాన్నపేట్ 36.3, రేగోడ్ 36.1, అల్లాదుర్గ్ 36.0, పెద్ద శంకరంపేట 35.8, టేక్మాల్ 35.7, హవేలి ఘనపూర్ 35.6, నర్సాపూర్ 35.4, కౌడిపల్లి 35.1, మాసాయిపేట 34.9°C జిల్లాలోని గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.