News March 22, 2025

మిషన్ వాత్సల్య పథకానికి అర్హుల జాబితా సిద్ధం చేయాలి: కలెక్టర్

image

మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 216 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌కు అధికారులు తెలిపారు. మిషన్ వాత్సల్య పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News December 26, 2025

తిరుపతిలో ముగిసిన చంద్రబాబు పర్యటన

image

తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌ను CM చంద్రబాబు ప్రారంభించారు. మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి ఇది మంచి వేదికని చెప్పారు. తర్వాత తిరుపతి జిల్లా నూతన పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. నో హెల్మెట్.. నో పెట్రోల్ అమలు చేయడంతో తిరుపతి పోలీసులను ప్రశంసించారు. TTD బోర్డు మాజీ సభ్యుడు ఎన్టీఆర్ రాజు ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి చేరుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

News December 26, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ నర్సీపట్నంలో గంజాయి లేడీ డాన్‌తో సహా ఎనిమిది మంది అరెస్ట్
➤ జిల్లాలో పలుచోట్ల వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు
➤ పాయకరావుపేటలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
➤ షిప్ బోటును ఢీకొన్న ఘటనలో మత్స్యకారుడు గల్లంతు
➤ స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు
➤ మాడుగుల నియోజకవర్గంలో రోడ్లు నిర్మాణానికి రూ.3.63 కోట్లు మంజూరు
➤ మాకవరపాలెంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు.

News December 26, 2025

ATS విధానం అమలులోకి తేవాలి: అమిత్ షా

image

ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్‌లో 40KGల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 3టన్నుల పేలుడు పదార్థాలను డిటోనేట్ కాకముందే స్వాధీనం చేసుకున్నామని యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్-2025లో తెలిపారు. పోలీసులకు అవసరమైన కామన్ ATS విధానాన్ని త్వరలో అమలులోకి తేవాలని డీజీపీలను కోరారు. అందరూ తెలుసుకోవాలి అనే విధానంతో కాకుండా అందరికీ తెలియజేయాలి అనే ప్రిన్సిపల్‌తో ముందుకు సాగాలన్నారు.