News March 23, 2025

₹లక్ష దాటిన వెండి ఇన్వెస్టర్లకు సూపర్ ఛాన్స్: జిమీత్

image

జీవితకాల గరిష్ఠానికి చేరిన వెండి ఇన్వెస్టర్లకు సదవకాశం కల్పిస్తోందని శామ్కో వెంచర్స్ CEO జిమీత్ మోదీ అన్నారు. గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన ప్రతిసారీ మంచి రాబడిని అందించిందని వివరించారు. 3, 6, 12 నెలల వ్యవధిలో 61, 62, 83% స్ట్రైక్ రేటుతో వరుసగా సగటున 21, 31, 28% రాబడి ఇచ్చిందన్నారు. కొవిడ్ టైమ్ మినహాయిస్తే Silver to Gold రేషియో 30 ఏళ్ల కనిష్ఠమైన 1.09% వద్ద ఉండటం బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోందన్నారు.

Similar News

News March 25, 2025

OTTలోకి సందీప్ కిషన్ ‘మజాకా’

image

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ‘మజాకా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఉగాది కానుకగా ఈ నెల 28 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ మూవీలో ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా గత నెల 26న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

News March 25, 2025

డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మృతి

image

తమిళ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా(48) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన తాజ్‌మహల్, అల్లీ అర్జున, అన్నక్కోడి, పల్లవన్, తదితర తమిళ చిత్రాల్లో నటించారు.

News March 25, 2025

అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డ్

image

ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డు సృష్టించింది. $30.31B మార్కెట్ విలువను సాధించింది. $90Mతో ఆర్సెలార్ మిత్తల్, $3Bతో న్యూకోర్ కార్ప్‌ను వెనక్కి నెట్టేసింది. ఈ భారతీయ కంపెనీ విజయనగర, డోల్వి, సేలమ్‌లో ప్లాంట్లు, అమెరికా, ఇటలీలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత 35.7MT ఉత్పత్తి సామర్థ్యాన్ని FY28లో 43.5 MT, FY31లో 51.5 MTకి పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.

error: Content is protected !!