News March 25, 2024

జియ్యమ్మవలస: గవరమ్మపేటలో ఏనుగులు

image

జియ్యమ్మవలస మండలంలోని వెంకటరాజుపురం, గవరమ్మపేట గ్రామాల మధ్య ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో అరటి, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఏనుగులతో పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News April 17, 2025

సమ్మర్ హాలీడేస్.. విజయనగరంలో చూడదగ్గ ప్రదేశాలు

image

వేసవి సెలవులకు విజయనగరం జిల్లా స్వాగతం పలుకుతోంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా గడిపేందుకు టూర్ ప్లాన్ చేసుకునేందుకు మంచి వేదిక కానుంది. తాటిపూడి రిజర్వాయర్, రామతీర్థం బోడికొండ, చాకలిపేట రామనారాయణం, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో సముద్ర తీర ప్రాంతాలు, గంట్యాడలో వైకుంఠ గిరి, పుణ్యగిరి శివాలయం, తదితర ప్రాంతాలను సందర్శించి ఆధ్యాత్మిక, పర్యాటక అనుభూతి పొందవచ్చు.

News April 17, 2025

VZM: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

image

భీమిలిలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలో ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. మహిళా స్టేషన్ ACP పెంటారావు సంఘటనా స్థలాన్ని బుధవారం పరిశీలించారు.

News April 17, 2025

VZM: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఈనెల 13న జాయిన్ అయ్యాడు. బుధవారం ఉదయం టిఫిన్ చేసిన తరువాత హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

error: Content is protected !!