News March 23, 2025

KMR: అప్పులు తీర్చలేక ఉరేసుకొని ఆత్మహత్య

image

సదాశివనగర్ మండలం ధర్మరావు పేట గ్రామానికి చెందిన సుంకరి శంకర్(51) కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పులు చేసి తీర్చే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. శంకర్ బిచ్కుంద మండలం నీరడిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

నాకు హోం శాఖ ఇవ్వాలి అని అనలేదు: రాజ్‌గోపాల్ రెడ్డి

image

TG: హోంశాఖ అంటే ఇష్టమని తాను చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని INC MLA కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఖండించారు. ‘నేను హోం శాఖ మంత్రి అయితే బాగుంటుందని నా ఫ్యాన్స్, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు మీడియాతో చెప్పాను. అంతేతప్ప నాకు హోంశాఖ ఇవ్వాలి, అది అయితేనే బాగుంటుందని అనలేదు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్. ఏ శాఖ ఇచ్చినా బాధ్యతయుతంగా పనిచేస్తా’ అని స్పష్టం చేశారు.

News March 26, 2025

కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్

image

జోర్డాన్ రాజధాని అమ్మన్‌లో జరుగుతోన్న సీనియర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్-2025లో భారత రెజ్లర్ కాంస్య పతకం గెలుచుకున్నారు. 87 కేజీల విభాగంలో చైనా రెజ్లర్‌ను చిత్తు చేసి బ్రాంజ్ మెడల్ సాధించారు. దీంతో భారత్ పతకాల ఖాతా తెరిచింది. హరియాణాకు చెందిన సునీల్ గతంలో ఏషియన్ ఛాంపియన్ షిప్స్‌లో ఒక గోల్డ్ (2020), ఒక సిల్వర్ (2019), రెండు బ్రాంజ్ (2022, 2023) మెడల్స్ గెలిచారు.

News March 26, 2025

లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం: MNCL కలెక్టర్

image

లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. స్కానింగ్ సెంటర్లలో పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలపవద్దని సూచించారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో తగ్గిన బాలికల నిష్పత్తిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!