News March 23, 2025
సిద్దిపేట: ఫిబ్రవరి 9న సౌదీలో మృతి.. నేడు అంత్యక్రియలు

సౌదీ అరేబియాకు బతుకు దేరువు నిమిత్తం కోహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన జాలిగం అశోక్ వెళ్లగా ఫిబ్రవరి 9న ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతదేహం స్వగ్రామం చేరడానికి కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను వేడుకున్నారు. సౌదీ అరేబియా ఎంబసీ అధికారులతో ఎంపీ మాట్లాడి శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. శనివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
Similar News
News September 19, 2025
KNR: పత్తి సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారంసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 44,885 ఎకరాల్లో పత్తి సాగైందని, 5,38,620 క్వింటాళ్ల దిగుబడిని అంచనా వేశామని తెలిపారు. జిల్లాలో పత్తి పంట సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News September 19, 2025
పొంగులేటి బయోపిక్.. హీరోగా సుమన్

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ‘శ్రీనన్న అందరివాడు’ అనే టైటిల్తో రూపుదిద్దుకునే ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. సీనియర్ నటుడు సుమన్.. పొంగులేటి పాత్రను పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. బయ్యా వెంకట నర్సింహ రాజ్ దీనికి డైరెక్టర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాసర్ల శ్యాం పాటలు రాస్తున్నారు.
News September 19, 2025
భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి: ఎమ్మెల్యే కొణాతాల

పరిశ్రమల కోసం భూములిచ్చి సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోవాలని అనకాపల్లి MLA కొణతాల రామకృష్ణ కోరారు. 2వ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 25 వేల ఎకరాలను రూ.2వేలకు ఇచ్చిన వారికి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. అచ్యుతాపురం, నక్కపల్లిలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు. భూ నిర్వాసితులకు ప్రత్యేక శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.